భార్య దూరం ఐతే భర్త కుంగిపోతాడు .. అదే మరి భర్త మరణిస్తే భార్య ఎం చేస్తుంది ?



భార్యభర్తల అనుబంధం గురించి ఎంత చెప్పిన తక్కేవే అవుతుంది. భారత దేశంలో వివాహానికి భార్య భర్తల అనుబంధానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. భార్యభర్తలు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ఒకరి ఎడబాటు మరొకరిని కుంగదీస్తుంది. యూనివర్సిటీ అఫ్ పడోనా భార్య భర్తల బంధంపై ఓ షాకింగ్ సర్వేను బయటపెట్టింది. భర్త బతికి ఉన్నప్పటి కన్నా భర్త చనిపోయిన తరువాతే భార్యలు ఎలాంటి టెన్సన్స్ లేకుండా ప్రశాంతంగా జీవిస్తున్నారని ఆ తాజా సర్వే ఒకటి వెల్లడిస్తున్నది. యూనివర్సిటీ ఆఫ్ పడోవాకు చెందిన శాస్త్రవెత్తలు 733 మంది ఇటలీ కి  చెందిన పురుషులు, 1154 మంది  స్త్రీలపై పరిశోధనలు  మొదలు పెట్టారు .. రోజులు , నెలలు  కాదు , ఏకంగా నాలుగేళ్ళు  పరిశోధనలు  చేసారు .. చివరకు ఒక విషయం తేల్చారు . అది  ఏంటంటే భర్త ఉన్న  మహిళల  కన్నా  భర్త  మరణించిన వారికి 23 శాతం ఒతిడి తగ్గిపోయిందట .. అంటే ఒతిడితో ఎదురయ్యే  సమస్యలూ దూరమే  అన్న మాట ... 

అదేమిటో గానీ, భార్య  మరణిస్తేనేమో  అది  భర్తను  తీవ్ర  మనస్తాపానికి  గురి చేస్తుందట .. అదే భర్త  మరణిస్తే మాత్రం  భర్తపై ఒతిడి తగ్గిపోతుందట .. భార్య  ఇంట్లో  పనులు  చేస్తూ , కాపురం దిద్దుకుంటూ, కుటుంబం  బాగోగులు  చూస్తూ  ఉంటుంది  కాబట్టి  భార్య  మరణం భర్తకు  శాపంగా, నష్టంగా, కష్టంగా అనిపిస్తుందట .. అదే  భర్త మరణిస్తే  మాత్రం  ఒక్కసారిగా భార్యపై  కొండంత  భారం తగ్గిపోయినట్లు అనిపిస్తుందట .. దాంతో  ఆమెపై  స్ట్రెస్  బాగా  తగ్గిపోతుందట ... మొతానికి కొండను  తవ్వి  ఈ జీవిత  సత్యమొకటి  తేల్చి చెప్పారన్న  మాట!! 

No comments